KODADA BADI
Monday 19 March 2012
Monday 12 March 2012
జాతీయ చిహ్నలు
భారతదేశ జాతీయ చిహ్నల భారతీయత తో ఏకాత్మకంగానూ, ప్రాచీన సంపదగానూ స్వాభావికంగా కలిసిపోయేవి. ప్రపంచ నలుమూలలలో విస్తరించిన అన్ని వర్గాల, నేపధ్యాల భారతీయులు తమ హృదయంలో దేశభక్తి, ఆత్మగౌరవం, కలుగజేసే ఈ జాతీయ చిహ్నలను చూసి గర్విస్తారు.జాతీయ జెండా
జాతీయ జెండా సమాంతరంగా (అడ్డంగా) విస్తరించి ఉండే మూడు రంగుల సమ్మేళనం. పైన కాషాయ వర్ణంలోనూ, మధ్యలో తెలుపు వర్ణంలోనూ, క్రింద ముదురాకు పచ్చలోనూ సమానమైన ప్రమాణంతో ఉంటుంది. జెండా యొక్క వెడల్పు, దాని పొడవులో 2. : 3 నిష్పత్తిలో ఉంటుంది. జెండాలోని తెలుపు పట్టీలో ముదురు నీలం రంగు చక్రం ఉండి, అది దేశభక్తి కి ప్రతీకగా ఉంటుంది. ఈ చక్రం యొక్క నమూనా అశోకుడి సార్వనాధే సింహస్ధూపం (సార్వనాధే లియన్ కేపిటల్) యొక్క స్తంభ ఫలకం పై నున్న చక్రం నుండి తీసుకొనబడింది. దీని యొక్క వ్యాసం, జెండాలోని తెల్లభాగం యొక్క వెడల్పుతో దాదాపు సమానంగా ఉండి 24 కమ్మీలు ( ఆకులు) కలిగి ఉంటుంది. జాతీయ జెండా యొక్క నమూనాను, భారత సంవిధాన సభ (కాన్స్టిట్యూటియన్ట్ అసెంబ్లీ ) 22 జూలై 1947లో ఆమోదించింది. ప్రభుత్వం శాసనాలు కాని నిబంధనలు ఎప్పటి కప్పుడు సవరించబడి, వాటి కనుగుణంగా, జాతీయ జెండా ప్రదర్శన నియంత్రిచబడింది. (చట్టం) నియమావళి, 1950 ( నవంబరు 12, 1950) మరియు జాతీయ గౌరవం ఎడల అవమానాలను నిరోధించే చట్టం, 1971 ( 1971 యొక్క నంబరు 69) లకు లోబడి జెండా ప్రదర్శన ఉంటుంది. భారత జెండా నిబంధనలను, రివాజులను ఒకే చోటికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయం సంబంధించిన వారందరికీ సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది.భారత జెండా నిబంధనలన (ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా), 2002 జనవరి 26, నుండి అమలులోకి వచ్చి, అప్పటి వరకూ ఆచరణలో ఉన్న జెండా నిబంధన – భారత్ యొక్క (ఫ్లాగ్ కోడ్- ఇండియా) ను రద్దు చేసింది. భారత జెండా నిబంధన 2002 లోని నియమాల ప్రకారం, సామాన్య ప్రజానీకం, ప్రైవేట్ సంస్ధలు, భారత జెండా ను ప్రదర్శించడానికి ఎటువంటి పరిమితులూ లేవు కాని, చిహ్నలు మరియు నామాలు (ద ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ ) అనుచితమైన వాడకాన్ని నిరోధించే చట్టం 1950ప్రకారం మరియు జాతీయ గౌరవానికి జరిగే అవమాన నిరోధక చట్టం 1971, లేక యింకా ఏదైనా ఈ విషయానికి సంబంధించి తీసుకుని వచ్చిన చట్టానికి లోబడి ఈ అవకాశం ఉంటుంది. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (భారత జెండా నిబంధన) గురించి మరింత తెలుసుకొనండి.
జాతీయపక్షి
భారతజాతి నెమలి, పావాక్రిస్టాటస్ వర్ణరంజితమైన, హంస పరిమాణంలో ఉండే పక్షి ఇది భారతదేశం యొక్క జాతీయపక్షి. ఇది విసనకర్రలా ఉండే ఈకలతో, కంటి క్రింద ఒకతెల్లని మచ్చతో పొడవైన నాజూకైన మెడతో ఉంటుంది. మగజాతి నెమలి, ఆడజాతి నెమలి కంటే అందంగా, మెరిసే నీలం రంగు ఛాతీ, మెడ కలిగి, కంటికి యింపైన కంచు- ఆకుపచ్చ రంగులో దాదాపు రెండువందల పొడవైన ఈకలతో ఉండే పింఛం తో ఉంటుంది. ఆడ నెమలి గోధుమ రంగులో మగ నెమలి కంటే చిన్నగా ఉండి, తోక లేనిదై ఉంటుంది. మగ నెమలి సర్వాంగ సుందరమైన ప్రణయనృత్యంతో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను సవరించుకునే విధానం ఒక కమనీయమైన దృశ్యం.జాతీయ పుష్పం
కమలం (నిలుంబా న్యూసిపెరా గెయార్టిన్) భారతదేశం యొక్క జాతీయ పుష్పం ఇది పవిత్రమైనది మరియు, ప్రాచీన భారతదేశంలో కళ, పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి, ఒక శుభ సంకేతంగా భారత సంస్కృతిలో కాలాతీతంగా నిలిచి ఉంది.జాతీయ వృక్షం
జాతీయగీతం
అనేక సందర్భాలలో భారతదేశపు జాతీయగీతం వాయిస్తారు, లేక ఆలపిస్తారు జాతీయగీతం యొక్క సరియైన పాఠాన్ని వివరణలతో, ఏ సందర్భాలలో గీతాన్ని పాడాలో, లేక వాయించాలో, ఏ విధమైన ప్రవర్తన నియమావళి ఆ సమయాల్లో జాతీయగీతానికి మర్యాద పూర్వకంగా పాటించాలో ఎప్పటికప్పడు సూచనలు వెలువడతాయి ఈ సూచనల యొక్క సారాంశం, ఈ సమాచార పత్రంలో, సామాన్య సమాచారం మరియు మార్గనిర్దేశికంగా పొందు పరచబడింది.జాతీయగీతం – పూర్తిగా మరియు క్లుప్తంగాఈ రచన, స్వర్గీయ రచయత రవీంద్రనాధ్ ఠాగూర్ గీతం, జనగణమన అనుపాట లో నుంచి తీసుకున్న మొదటి నాలుగు పంక్తుల్లోని పదాలు మరియు సంగీతం దీనిని భారతదేశపు జాతీయగీతంగా తీసుకున్నారు. ఇది ఈ విధంగా చదవబడుతుంది.
జన- గణ- మన- అధినాయక, జయహే
భారత- భాగ్య- విధాత
పంజాబ్- సింధ్- గుజరాత్- మరాఠా
ద్రావిడ- ఉత్కళ- వంగా
వింధ్య- హిమాచల- యమునా- గంగా
ఉచ్ఛల- జలధి- తరంగా
తవశుభ నామే జాగే
తవశుభ ఆశిశ మాంగే
గాహే తవ జయ గాధా
జన-గణ- మంగళ-దాయక జయహే
జయ జయ జయ, జయహే!
పైన పేర్కొనది జాతీయగీతం యొక్క పూర్తిపాఠం పాడే సమయం సుమారు ఏభై రెండు
సెకన్లు సంక్షిప్తంగా మార్చిన మొదటి మరియు చివరి పంక్తులు మాత్రమే కలిగిన
జాతీయగీతాన్ని కూడ కొన్ని సందర్భాలలో వాడతారు. అది ఈ విధంగా ఉంటుంది.
జన- గణ- మన- అధినాయక, జయహే
భారత- భాగ్య- విధాత
జయహే, జయహే, జయహే
జయ జయ జయ, జయహే!
చిన్నదిగా ఉన్న జాతీయగీతం పాడడానికి పట్టే సమయం సుమారు ఇరవై
సెకన్లుజాతీయ గేయం
వందేమాతరం అను గేయాన్ని సంస్కృతంలో బకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం, స్వాతంత్ర సమర కాలంలో ప్రజలకు ప్రేరణ శక్తిగా నిలిచింది. ఈ గేయం, జన-గణ- మన జాతీయ గీతంతో సమానమైన హాదా కలిగి ఉంది. రాజకీయంగా ఈ గేయం మొదటిసారిగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1896 నాటి సమావేశంలో పాడబడింది. దిగువ వ్రాసినది గేయం యొక్క మొదటి నాలుగు పంక్తుల పాఠం
వందేమాతరం!
సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం,
సస్యశ్యామాలాం మాతరం!
వందేమాతరం!
శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినిమ్
ఫుల్లకు సుమితా ద్రుమదళ శోభినిమ్
సుహాసీనిమ్ సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం
శ్రీ అరబిందో వ్రాసిన గద్యభాగం 1 లో నుంచి ఆంగ్లంలో ఈ పంక్తుల అనువాదం
తీసుకొనబడింది.జాతీయనది
జాతీయ చిహ్నం
జాతీయ కేలండర్
జాతీయ కేలండర్ శక, శకం మీద ఆధారపడి తయారుచేయబడింది. చైత్రం మొదటి నెలగా, 365 రోజులు ఒక సామాన్య సంవత్సరంగా పరిగణించి 22 మార్చి 1957 లో తయారుచేయబడింది. దీనితో పాటు గ్రిగోరియన్ కేలండర్ కూడ క్రింద పేర్కొనబడిన ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తారు.- ఇండియా గజిట్ ( భారత ప్రభుత్వ పత్రిక)
- అఖిల భారత రేడియో ప్రసార కేంద్రాల నుండి వచ్చే వార్తలు
- భారతదేశ ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్లు మరియు
- ప్రభుత్వం ప్రజలను ద్దేశించి చేసే ప్రసంగాలు
జాతీయ ఫలం
జాతీయ క్రీడ
Friday 9 March 2012
Monday 5 March 2012
Saturday 3 March 2012
Subscribe to:
Posts (Atom)